ట్రినిడాడ్: సొంతగడ్డపై పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 344 పరుగులకు ఆలౌటైంది. లోయరార్డర్లో జస్టిన్ గ్రీవ్స్ (73), కెప్టెన్ రోస్టన్ చేజ్ (70) ఆరో వికెట్కు 96 రన్స్ జోడించి ఆ జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. బ్రాండన్ కింగ్ (46) కూడా రాణించాడు. సాజిద్ ఖాన్ (4/85) నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాక్ కడపటి వార్తలు అందే సమయానికి 101/2తో నిలిచింది.