హైదరాబాద్ : బెంగళూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత రెండు రోజులుగా అధ్యయనంలో భాగంగా కర్నాటకలో బీసీ కమిషన్ బృందం పర్యటిస్తున్నది. ఈ సందర్భంగా బెంగళూరుకు వచ్చిన సీఎం కేసీఆర్ను స్థానిక లీలా ప్యాలెస్లో బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్రావు సారథ్యంలో సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్పటేల్ నూలి, కే కిశోర్ గౌడ్ ప్రత్యేకంగా సీఎంను కలిశారు.
ఈ సందర్భంగా తమ అధ్యయనం వివరాలను సీఎంకు వివరించారు. మరో రెండు రోజులపాటు ఇక్కడే ఉండి ముఖ్య ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులు, సామాజికవేత్తలు, కలువనున్నట్లు చైర్మన్ వివరించారు. బీసీ కమిషన్ కొనసాగిస్తున్న అధ్యయన వివరాలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఇదే విధంగా ప్రత్యేక స్పూర్తితో కొనసాగించాలని సీఎంకు బీసీ కమిషన్ బృందానికి సూచించారు.