సంగారెడ్డి : నల్లా తిప్పితే తాగునీరు వచ్చిందని, కాలంతో పని లేకుండా పంటకు నీరందించేది బసవేశ్వర ఎత్తిపోతల పథకం అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఒకప్పుడు తాగు నీరు లేని నారాయఖేడ్ నియోజకవర్గానికి బసవేశ్వర లిప్ట్ తోసాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. సోమవారం మనూర్ మండలం బోరంచ గ్రామంలో బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ సర్వే కోసం రూ.11.15 కోట్లు మంజూరు చేసిందన్నారు.
లక్షా అరవై ఐదు వేల ఎకరాలకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన రెండు నెలల్లోగా సర్వే పూర్తి చేసి డీపీఆర్ అందించాలని ఎస్ఈని ఆదేశించారు. బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గం మొత్తానికి, అందోల్ నియోజకవర్గం లోని రేగోడు, వట్ పల్లి మండలాలకు సాగునీరు అందుతుందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం లో 1.31 లక్షల ఎకరాలకు, అందోల్ నియోజకవర్గంలో 34 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఏ లిఫ్ట్ అవసరం లేకుండా మల్లన్న సాగర్ కాలువ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బోరంచ, రామ్ తీర్త్ (కంగ్టి), దుద్యాలవద్ద లిఫ్ట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వాలు 70 సంవత్సరాలలో ఒక్క చుక్క నీరు తేలేదన్నారు. నల్లవాగు నిండుకుండలా ఉండేలా బాధ్యత తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. నారాయణఖేడ్ నియోజకవర్గం లో రాబోయే రోజుల్లో అద్భుతమైన పాఠశాలలను నిర్మాణం చేస్తామన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి అన్నారు. ధరణి తో భూముల క్రయ విక్రయాలు సులువుగా మారిందన్నారు. రైతులు వరి విత్తనాలు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, శాసనమండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, డీసీపీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పెండ్లి అయిన కొద్ది గంటలకే పెండ్లి కొడుకు ఆత్మహత్య
దారుణం : భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
ఊహకందని విధంగా రాష్ట్రాభివృద్ధి : మంత్రి సబిత
ఆదిలాబాద్లో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత
యుద్ధ ప్రాతిపదికన సిందోల్ రోడ్డు పనులు : మంత్రి హరీశ్ రావు
జయశంకర్ సార్ చరిత్రలో నిలిచిపోతారు