కోటగిరి, అక్టోబర్ 6 : బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో రోజురోజుకూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రానికి చెందిన పద్మశాలీ కులస్థులు బీఆర్ఎస్ పార్టీకి, బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి పూర్తి మద్దతు తెలిపారు.
ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి శుక్రవారం బాన్సువాడలో స్పీకర్కు అందజేశారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు.