Minister KTR | బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో వంద సార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లోనే 13 సార్లు ప్రశ్నపత్రం లీకయ్యింది. ప్రధాని మోదీ రాజీనామాను అడిగే దమ్ము బండి సంజయ్కి ఉన్నదా? ఆ రాష్ట్రాల్లో తిరిగి పరీక్షలు నిర్వహించారు తప్ప మంత్రిని, లేదా ముఖ్యమంత్రిని ఏనాడూ బాధ్యులను చేయలేదు. స్వయంగా బీజేపీ నాయకులే కీలక సూత్రధారులుగా ఉన్న మధ్యప్రదేశ్ వ్యాపం ఉద్యోగాల కుంభకోణంలో ఆ పార్టీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుసు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తే.. అది తమ పార్టీకి యువకులను దూరం చేసే కుట్ర అన్న దుర్మార్గుడు బండి సంజయ్. ఒక వ్యక్తి చేసిన తప్పును బూచిగా చూపించి మొత్తం పబ్లిక్ సర్వీసు కమిషన్నే రద్దుచేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉన్నది. ఈ కేసులో నిందితులు బీజేపీ క్రియాశీల కార్యకర్తలనే విషయం విచారణలో తేలింది. తమ రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను పణంగా పెట్టి పేపర్ను లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదే.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు విమర్శించారు. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే కనీస పరిజ్ఞానం ఆయనకు లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థల పనితీరు, వాటి పరిధుల గురించి అవగాహనలేని మహా అజ్ఞాని బండి అని మరోసారి తేలిందని వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యక్తి ఎంపీ ఎలా అ య్యాడో అర్థం కావడం లేదని పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ చేసి న విమర్శలను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం లేకుండా, వాటి మధ్య ఉన్న తేడా తెలువకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా బండి సంజయ్ దిగజారుడు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు.
భూరికార్డుల ప్రక్షాళన, వాటి సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణిపైనా అర్థరహితమైన ఆరోపణలు చేయడం.. బండి సంజయ్ దగుల్బాజీ రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు ధరణి పోర్టల్కు టీఎస్పీఎస్సీతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడాన్ని సహించబోనని కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాగే అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజాక్షేత్రంలో అభాసుపాలై, పరువునష్టం కేసును ఎదుర్కొంటున్నాడని గుర్తుచేశారు. అయినప్పటికీ బుద్ధి రాలేదని, ఈసారి కూడా తనకు సంబంధంలేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రానున్న రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
బీజేపీ పాలిస్తున్న అనేక రాష్ర్టాల్లో వరుసగా ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఆ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా దాదాపు వందకు పైగా సందర్భాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీలు జరిగాయని, ఇందులో స్వయంగా బీజేపీ నేతలే ప్రధాన సూత్రధారులుగా తేలిందని పేర్కొన్నారు. స్వయంగా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే గత ఎనిమిదేండ్లలో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని, దీనికి బండి సంజయ్ జవాబు చెప్పాలని కేటీఆర్ సూటిగా నిలదీశారు. ప్రధాని మోదీని రాజీనామా చేయాలని అడిగే దమ్ము సంజయ్కున్నదా? అని సవాల్ చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రశ్నపత్రాలు లీకైతే.. తిరిగి పరీక్షలు నిర్వహించారే తప్ప మంత్రిని, లేదా ముఖ్యమంత్రిని ఏనాడూ బాధ్యులను చేయలేదని గుర్తుచేశారు. స్వయంగా బీజేపీ నాయకులే కీలక సూత్రధారులుగా ఉన్న మధ్యప్రదేశ్ వ్యాపం ఉద్యోగాల కుంభకోణంలో ఆ పార్టీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుసునని అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలలో జరిగితే ఒకలా.. ఇతర పార్టీలు ప్రాతినిధ్యం వహించే రాష్ర్టాల్లో మరోలా వ్యవహరించడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విమర్శించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభుత్వం మెరుపువేగంతో స్పందించిందని.. సిట్ను నియమించి, బా ధ్యులైన వారందరినీ అరెస్టు చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎప్పుడైనా, ఎకడైనా లోపం జరిగితే.. ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించి, ఎలాంటి చర్యలు తీసుకున్నదో ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తిచేశారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయాలని కీలక నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఇది బాధాకరమైన నిర్ణయమైనప్పటికీ తప్పలేదని.. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టంచేశారు. పారదర్శకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును పట్టించుకోకుండా.. వ్యవహారం మొత్తాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలన్న ప్రయత్నాన్ని బీజేపీ మానుకోవాలని సూచించారు. తమ స్వార్థం కోసం సమాజంలో చిచ్చుపెట్టే అలవాటు బీజేపీకి కొత్త కాదని, పేపర్ లీకేజీల వ్యవహారాన్ని సైతం శాంతిభద్రతల సమస్యగా మార్చేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ యువకులు, విద్యార్థులు టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మరొకసారి మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం రాష్ట్ర యువత ప్రయోజనాలు కాపాడటం కోసం అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తున్నదని, వారిపట్ల తమ నిబద్ధతను గుర్తించాలని కోరారు. ఇచ్చిన హామీ కన్నా రెండింతలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువత పట్ల తన నిబద్ధతను రాష్ట్ర ప్రభుత్వం చాటుకున్నదని తెలిపారు. తెలంగాణ యువతకే 95 శాతం ఉద్యోగాలు దకాలన్న సమున్నతమైన ఆశయంతో దేశంలో ఎకడా లేనివిధంగా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిందని, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఒక వ్యక్తి వలన జరిగిన దురదృష్టకరమైన సంఘటన బాధాకరమన్నారు. 8 సంవత్సరాలుగా ఒక ఆరోపణ లేకుండా వేలాది ఉద్యోగాలు భర్తీచేసిన మన పబ్లిక్ సర్వీసు కమిషన్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ వ్యవహారానికి రాజకీయరంగు పులిమి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న కుటిల రాజకీయ పార్టీల అసలు నైజాన్ని, మొసలి కన్నీరును గుర్తించి చైతన్యంతో వ్యవహరించాలని విద్యార్థులు యువతను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా, అవసరమైన కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సూచించారు.
కోటి ఆశలతో ప్రిపేరవుతున్న విద్యార్థులను పరీక్షలు పకనబెట్టి తనతో కలిసి రావాలన్న దగుల్బాజీ నాయకుడు బండి సంజయ్కి యువత గురించి మాట్లాడే అర్హత లేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే, అది తమ పార్టీకి యువకులను దూరం చేసే కుట్ర అన్న దుర్మార్గుడు బండి అని, ఆ వ్యాఖ్యలను యువత ఇంకా మర్చిపోలేదని తెలిపారు. ఒక వ్యక్తి చేసిన తప్పును బూచిగా చూపించి మొత్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్నే రద్దు చేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉన్నదని మండిపడ్డారు. ఈ కేసులో నిందితులు బీజేపీ క్రియాశీల కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందని తెలిపారు. తమ రాజకీయాల కోసం లక్షలమంది నిరుద్యోగుల జీవితాలను పణంగా పెట్టి పేపర్ను లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదేనని విమర్శించారు. శరవేగంగా చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అకసుతోనే ఇంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం యువత భవితతో ఆడుకుంటున్న బండి వంటి మోసగాళ్ల పట్ల యువతీయువకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.