రాజన్న సిరిసిల్ల : కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కనబడటం లేదంటూ టీఆర్ఎస్ యూత్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీ సంజయ్ చిత్ర పటంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఎంపీగా గెలిచి మూడు సంవత్సరాలు గడుస్తున్నా నియోజవర్గ అభివృద్ధికి చేసిందేమి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలను గాలికి వదిలి ప్రజా సంగ్రామ యాత్ర అంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. తన నియోజక వర్గ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే యాత్రల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ముందు తన నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చి ఎక్కడైనా తిరుగొచ్చని సూచించారు. కాగా, బండి సంజయ్ ఎక్కడైనా కనిపిస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.