Bandi Sanjay | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ‘గ్రూప్ వన్ పేపర్ లీకేజీపై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఏయే గ్రామాల్లో ఎంత మంది మెయిన్స్కు అర్హత సాధించారో జాబితా ఉన్నది’ అంటూ గప్పాలు కొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఇప్పుడు నాలుక మడత పెట్టేశారు. ఆధారాలు లేవని, గాలి మాటలు మా ట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించినట్టు పరోక్షంగా ఒప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ను బదనాం చేసేందుకు బండి డైరెక్షన్లో డ్రామా నడుస్తున్నదని స్పష్టమైంది.
వాస్తవాలు ఇవి..
గ్రూప్-1 మెయిన్స్కు అర్హత సాధించినవారిలో బీఆర్ఎస్ జడ్పీటీసీ, సర్పంచ్, సింగి ల్ విండో చైర్మన్ పిల్లలు ఉన్నారని, జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మంది క్వాలి ఫై అయ్యారని, ఒకే గ్రామం నుంచి ఆరుగురు ఉన్నారని 19న బండి ఆరోపించారు. ఒక్కొక్కరి నుంచి రూ.3-5 లక్షలు వసూలు చేశారంటూ ప్రచారం చేశారు. మంత్రి కేటీఆర్ పేరును పదే పదే ప్రస్తావించారు. మీ వద్ద ఉన్న ఆధారాలను ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఈ నెల 20న బండికి నోటీసు ఇచ్చారు. దీంతో బండి సంజయ్కి దిమ్మ తిరిగింది. ఆధారాలను ఇచ్చేదే లేదంటూ ప్రకటన ఇచ్చారు. తాజాగా ఉగాది రోజు మీడియా ప్రతినిధులు ఇదే విషయంపై ప్రశ్నించగా.. ‘మేం ప్రజల్లో చర్చించుకుంటున్న విషయాలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. అంటే ఎలాంటి ఆధారాలు లేవని, గాలి మాటలను పోగుచేసి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నామని ఒప్పుకున్నారు. అంతేకాదు.. సిట్ నోటీసులకు స్పందించేది లేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే సహకరిస్తామంటూ మళ్లీ పాత పాటే పాడారు.