హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మాది ప్రజాపాలన అని నిత్యం ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎత్తిచూపినందుకు ఆంక్షల కత్తితో అడ్డుకుంటున్నది. ఇరిగేషన్శాఖలో ఇటీవల సీనియర్లను పక్కనపెడుతూ జూనియర్లు, ఏపీ స్థానికత కలిగిన అధికారులకే కీలకస్థానాలను ప్రభుత్వం కట్టబెడుతున్నది. దీంతో ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఇంజినీర్లను పక్కకు తప్పిస్తుండటంతోపాటు, తెలంగాణ ఇంజినీర్లపై ఎక్కడికక్కడ నిఘాను పెట్టింది. ఇరిగేషన్పై మీడియాకు సమాచారం ఎవరిస్తున్నారు? లేఖలు, ప్రభుత్వపర అంశాలు ఎవరు లీకు చేస్తున్నారు? అంటూ కొంద రు ఇంజినీర్లపై కక్షసాధింపు చర్యలకు పూనుకున్నది. దీంతో ఆయా అంశాలపై ఇరిగేషన్లో ‘తెలంగాణ’పై ఆంక్షల పేరి ట ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఆ తప్పులను సరిదిద్దుకోపోగా, ప్రజాపాలన అని చెబుతున్న రేవంత్ సర్కార్.. ఇంజినీర్లపైనే కాదు ఏకంగా జలసౌధ భవన సముదాయాన్నే కట్టుదిట్టం చేసింది. నిరుడు ఎ న్నడూ లేనివిధంగా భవనంలోకి మీడి యా ప్రతినిధులు, ఇతరుల ప్రవేశాన్ని నిషేధించింది. గుర్తింపు కార్డు ఉంటేనే జలసౌధలోకి అనుమతించాలని ఈఎన్సీని ఆదేశించింది. ఏ ఫ్లోర్లో, ఏ అధికారి వద్దకు వెళ్తున్నామో చెప్పిన తర్వాతే, సదరు అధికారి అనుమతిస్తేనే భవనంలోకి అనుమతించాలని అధికారులకు హుకుం జారీచేసింది. దీనివెనుక కేంద్రంలోని బీజేపీకి అత్యంత సన్నిహితుడిగా ఒకాయనే కారణమని తెలుస్తున్నది. విలేకరులు జలసౌధలో తిరుగుతూ ప్రతి తప్పిదాన్ని వెలుగులోకి తెస్తున్నారని, వారిని అనుమతించకూదని, విజిటర్స్ ఎవరు వచ్చినా పేరు నమోదు చేయడం తప్పనిసరి అని సదరు నేత ఆదేశించాడని తెలిపింది. ఆయన ఆదేశాలే తరువాయి కాంగ్రెస్ సర్కార్ ఆచరణలోకి తెచ్చిందని జలసౌధలో చర్చించుకుంటున్నారు.