హైదరాబాద్ : ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి సురేష్ అకాల మరణం పట్ల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన సురేష్ తన కొడుకు సుమన్ విద్యార్థి పోరాటాలలో చురుగ్గా ఉండేందుకు ప్రోత్సాహించారన్నారు. ఆయన మృతి బాధాకరమన్నారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సురేష్ రైతులకు విలువైన సేవలందించారని మంత్రి గుర్తు చేసుకున్నారు.
ఆయన మృతి టీఆర్ఎస్కు, మెట్పల్లి ప్రాంతానికి తీరని లోటన్నారు. సుమన్ కుటుంబ సభ్యులకు మంత్రి తన సంతాపాన్ని, సానుభూతి తెలిపారు. సురేష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్