Rathnam Movie | కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటూ టక్కున గుర్తోచ్చే పేరు హీరో విశాల్. పేరుకు తెలుగువాడు అయిన హీరోగా తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ హీరో పెళ్లి ఎప్పుడు చెసుకుంటావు తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య పెళ్లి కూతురు సినిమాలో నటించిన అనీషా రెడ్డితో విశాల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన ఈ జంట అనుకోకుండా విడిపోయారు. ప్రస్తుతం విశాల్ తన సినీ కెరీర్లో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇక విశాల్ నటిస్తున్న తాజా చిత్రం రత్నం. ఈ సినిమాకు సింగం, యముడు చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తన పెళ్లి గురించి మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు విశాల్.
ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అందరూ తన పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి నాకు పెళ్లి కంటే మించిన బాధ్యతలు ఉన్నాయి. అవి పూర్తయిన అనంతరం పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కూతురు ఎవరో తనకు కూడా తెలియదు అంటూ తెలిపాడు. ఇక రత్నం సినిమా విషయానికి వస్తే.. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని విశాల్ ధీమా వ్యక్తం చేశాడు.