PM Modi | న్యూఢిల్లీ: ఎన్నికల బరిలో నిలిచి, గెలవలేని నేతలు రాజ్యసభ సభ్యులుగా రాజస్థాన్ నుంచి ఎన్నికవుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. “మీరు రాజస్థాన్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను రాజ్యసభకు పంపించారు.
ఆ తర్వాత ఆయన రాష్ట్రంలో కనిపించారా? ఇప్పుడు మళ్లీ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆ పార్టీ నేత మరొకరు వెళ్లారు. ఎన్నికల్లో పోరాడి, గెలవలేనివారు రాజస్థాన్కు వస్తున్నారు” అని ఎద్దేవా చేశారు. అయితే ఆయన సోనియా గాంధీ పేరును నేరుగా ప్రస్తావించలేదు.