హైదరాబాద్: బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆ పార్టీ నేతల పద్ధతి బాగాలేదని, మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవడానికి, వందలాది మంది తెలంగాణ బిడ్డల బలిదానాలకు బీజేపీయే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్, రేవంత్.. ఇప్పుడు ప్రజలపై ప్రేమ పుట్టుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. తెలంగాణ బీజేపీలో కొత్త బిచ్చగాళ్లు కుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు. సీఎం మంత్రులపై అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నదని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో రేవంత్ రెడ్డిని జనాలు తరిమికొట్టారని చెప్పారు. చంద్రబాబు చెప్పులు మోసిన కుక్క అని విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రెస్మీట్లు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నదని వెల్లడించారు.