B Vinod Kumar | మూడు గంటలు కరెంటు కావాలా? 24 గంటల కరెంటు కావాలా..? అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. హుజూరాబాద్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. బీఆర్ఎస్కు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ప్రపంచంలో అక్కడ లేనివిధంగా కేసీఆర్ బీమా అమలు చేయబోతున్నారన్నారు. రైతుబంధు, రైతు బీమా తరహాలోనే తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కేసీఆర్ దీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 93 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో 35 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, రూ.15 లక్షలకు ఆరోగ్యశ్రీని పెంచబోతున్నట్లు తెలిపారు. అలాగే రేషన్లో సన్న బియ్యం ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. సౌభాగ్య లక్ష్మి కింద ప్రతి మహిళకు రూ.3వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సూక్ష్మ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, రాష్ట్రంలో ముందుకు సమగ్ర సర్వే మాదిరిగా మళ్లీ అన్ని కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. వారిని అభివృద్ధి చేసేందుకు సూక్ష్మ ప్రణాళిక అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ అనుబంధ ఇండస్ట్రీలను నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు.