హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో కార్యక్రమాలను పూర్తి చేసుకుని వినోద్కుమార్ వరంగల్ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆరేపల్లి వద్ద ఓ యువకుడు తీవ్రంగా గాయపడి ఉన్నాడు. గమనించిన ఆయన వెంటనే తన వాహనాన్ని ఆపి యువకుడి వద్దకు వెళ్లారు. స్పృహలేని స్థితిలో ఉన్న యువకుడిని వెంటనే తన పైలెట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. యువకుడి వివరాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ నాయకులకు సూచించారు.