కమాన్పూర్, డిసెంబర్ 17: ఆటోడ్రైవర్లు చింతించాల్సిన అవసరం లేదని, వారిని ఆదుకునేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఆదివారం ఆయన జిల్లాకు వచ్చిన సందర్భంగా కమాన్పూర్ మండల కేంద్రంలోని క్రాస్ రోడ్డు వద్ద ఆటో ఓనర్లు, డ్రైవర్లు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆటోల గిరాకీ లేకుండా పోయిందని, ఫలితంగా తాము జీవనోపాధి కోల్పోతున్నామని తెలిపారు. మంత్రి స్పందిస్తూ.. ఆటోవాళ్లకు ఏడాదికి రూ.12 వేలు అందించే కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు. ఆటోనగర్ పెట్టుకుంటే స్థలంతోపాటు ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.