నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, డిసెంబర్ 20: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని, లేనిపక్షంలో తమకు నెలకు రూ. 15వేల జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్కార్ తీరును నిరసిస్తూ బుధవారం పలు జిల్లాల్లో నిరసనలు చేపట్టారు. ఆటోలతో బంద్ పాటించారు. హనుమకొం డ జిల్లా పరకాల పట్టణంలోని ఆర్టీసీ డిపో నుంచి పాత ఏటీఎం సెంటర్ వరకు ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగ ర్ పట్టణంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ తీశారు. జైనూర్ మండల కేంద్రంలో 100 ఆటోలతో ర్యాలీ తీసి, రోడ్డుపై బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఆటోల బంద్ నిర్వహించి, లింగోజి తండా ఎక్స్ రోడ్డు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంద్రవెల్లి మండలంలోనూ ఆటోల యజమానులు, డ్రైవర్లు బంద్ పాటించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని జమ్మికుంట రూట్ ఆటో యూనియన్ అధ్యక్షుడు సిరికొండ శరత్, మాజీ అధ్యక్షుడు ఎస్కే ఫయా జ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ తీశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో సీఐటీ యూ ఆధ్వర్యంలో సుమారు 100 ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధా న చౌరస్తాలో రాస్తారోకో చేయడంతో నాలు గు వైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. సీఐటీయూ నేత నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.