అటవీశాఖ అధికారులపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి సీరియస్ అయ్యారు. అక్రమ ఇసుక, కలప తరలింపునకు కొందరు అటవీ అధికారులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. రైతులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫారెస్టు అధికారులే అసలు దొంగలు అని విమర్శించారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో శనివారం జడ్పీ సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సమావేశానికి డీఎఫ్వో నీరజ్కుమార్ గైర్హాజరయ్యారు. ఆయనకు బదులుగా కాగజ్నగర్ ఇన్ఛార్జి ఎఫ్డీవో అప్పలకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పరిధిలోని గ్రామాలకు రోడ్డు, బ్రిడ్జిలకు అనుమతులు ఇవ్వకుండా అటవీ అధికారులు జాప్యం చేయడంపై కోవాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ఉందని తెలిసినప్పటికీ డీఎఫ్వో ఎందుకు హాజరుకాలేదని.. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. డీఎఫ్వోను సరెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పట్టించుకోకుండా బీట్ అధికారులు గ్రామాల్లో ఎలా తిరుగుతారో చూస్తామని అన్నారు. ఆదివాసీలు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరించారు.