రవీంద్రభారతి, ఆగస్టు 30: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషితోనే కళాకారులకు ఆదరణ లభిస్తున్నదని తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం బాధ్యులు అన్నారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీడియాతో సంఘం అధ్యక్షుడు అభినయ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యశ్పాల్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా 8 ఏండ్లుగా ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్న తమ సేవలకు గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందని చెప్పారు.
583 మంది సారథి కళాకారులను ప్రభుత్వంలో భాగస్వాములను చేస్తూ తీసుకున్న నిర్ణయం గొప్పదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమనంగా 30 శాతం పీఆర్సీని తమకు కూడా వర్తింపజేసిన కేసీఆర్కు కళాకారులపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు, రాష్ట్ర మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకు డు డాక్టర్ మామిడి హరికృష్ణకు కళాకారులు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సుధాకర్, చంద్రప్రకాశ్, వెంకన్న,శ్రీను పాల్గొన్నారు.