ఖమ్మం , ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): వరుస సెలవుల తరువాత తొలిరోజు తరహాలోనే రెండోరోజు (మంగళవారం) కూడా ఆంధ్రా, తెలంగాణలోని ఆయా జిల్లాల నుంచి సుమారు 60 వేల బస్తాల మిర్చి పంటను రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని మిర్చియార్డుకు తీసుకొచ్చారు. దీంతో కాంటాలు, తోలకాలకు తీవ్ర ఇబ్బంది కలిగింది.
ఉదయం జరిగిన జెండాపాటలో తేజరకం మిర్చికి గరిష్ఠ ధర క్వింటాకు రూ.23 వేలు పలికింది. మధ్య ధర రూ.21 వేలు, కనిష్ఠ ధర రూ.18 వేలు పలికింది. తాలురకం మిర్చి ధర క్వింటాకు రూ.14,500, మధ్య ధర రూ.13 వేలు, కనిష్ఠ ధర రూ.9 వేల చొప్పు న నిర్ణయించి ఖరీదుదారులు మిర్చి పంటను కొనుగోలు చేశారు.