తుంగతుర్తి, ఆగస్టు 14 : తుంగతుర్తి మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నూతన కమిటీని ఆ సంఘం జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడు శంకరమంచి రవీందర్ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పూసపల్లి యాదగిరి, కార్యదర్శిగా కోదాటి విక్రమ్, ఉపాధ్యక్షుడిగా ఓరుగంటి శ్రీనివాస్, కోశాధికారిగా కొండగడుపుల ఎల్లయ్యను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పూసపెల్లి యాదగిరి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, జర్నలిస్టుల హెల్త్ కార్డు, ఇంటి స్థలాల మంజూరి సమస్యలపై, రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు తాళ్లపల్లి సోమన్న, వడ్లకొండ శ్రీనివాస్, ఎండి నసిరుద్దీన్, ఎండి మాజిద్, అండం సైదులు, భూపతి సైదులు, ఎల్లబోయిన రాజేంద్రప్రసాద్, వర్ధల్లి వీరమల్లు, బింగి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.