యాదాద్రి, జూలై 26 : ఈ నెల 29న ప్రారంభం కానున్న శ్రావణలక్ష్మి కోటికుంకుమార్చనకు యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మంగళవారం ఆలయ అధికారులు దక్షిణ దిశ మొదటి ప్రాకార మండపాన్ని శుద్ధి చేయించారు. 30 రోజులపాటు సాగే కుంకుమార్చనలో 30 మంది రుత్వికులు, ప్రధానార్చకులు, అర్చకులు పాల్గొంటారని ఈవో గీత వెల్లడించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు వారి గోత్రనామాల పేరిట సంకల్పం చేస్తారు.
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 5న వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఈ వ్రతం ఏర్పాట్లపై జేఈవో వీరబ్రహ్మం మంగళవారం సమీక్షించారు. భక్తులు నేరు, వర్చువల్గా వ్రతంలో పాల్గొనేందుకు టికెట్లు జారీ చేస్తామన్నారు. 5న ఉదయం 10 నుంచి వరకు జరిగే వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని పేర్కొన్నారు.