అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకుపోవాలి
మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశం
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): హజ్యాత్ర విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన దాదాపు 3,500 మంది యాత్రికులు ఈ నెల 20 నుంచి జూన్ 30 వరకు హజ్యాత్రకు వెళ్లనున్నారు. హజ్యాత్ర ఏర్పాట్లపై నాంపల్లిలోని హజ్భవన్లో హజ్ కమిటీ బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి కొప్పుల హాజరయ్యారు.
శంషాబాద్ విమానాశ్రయంలో హజ్ యాత్రికులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. హజ్ యాత్ర కోసం విసృ్తత ఏర్పాట్లు చేశామని, మగ, ఆడ యాత్రికులకు వేర్వేరుగా హ్యాండ్ బ్యాగేజీ స్రీ నింగ్, ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ చెక్ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశామని మంత్రి కొప్పుల చెప్పారు. సమావేశంలో మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నదీమ్, హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీయుల్లా తదితరులు పాల్గొన్నారు.