హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఏర్పడకముందు పదేండ్ల కాలానికి, ఏర్పడిన తరువాత పదేండ్లలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. దమ్ములే ని రేవంత్రెడ్డి ధరణిని ఎత్తేస్తామంటూ తెలివి తక్కు వ వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాముల పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలోనే కాకుండా పార్టీలోనూ అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
రూ.50 కోట్లు ఖర్చుపెట్టి రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడని కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ధరణిని ఎత్తేసి మళ్లీ దళారీ వ్యవస్థను తెచ్చి తద్వారా రై తులకు భూ సమస్యలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలన్నదే రేవంత్ ఆలోచన అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేషాలు వేసినా రైతులు ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లోలేరని సతీశ్రెడ్డి స్పష్టం చేశారు.