Pollution | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగి ప్రమాద సంకేతాలకు దారితీస్తున్నది. విద్యుత్తు కోతల కారణంగా జనరేటర్ల వినియోగం పెరుగుతున్నదని.. ఫలితంగా వాయు నాణ్యత క్షీణిస్తున్నదని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీఎస్పీసీబీ) అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పరిస్థితి ఆందోళనకరంగా మారగా, ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనూ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సనత్నగర్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. సోమవారం మధ్యా హ్నం ఏకంగా 431 ఏక్యూఐ (ఎయిర్ క్వాలి టీ ఇండెక్స్) నమోదైనట్టు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తెలిపారు. మరోవైపు నగరంలో సగటున 108 ఏక్యూఐ నమోదైనట్టు అధికారులు తెలిపారు. జూపార్లో 135, పటాన్ చెరువులో 112 తప్ప గ్రేటర్ పరిధిలో గాలి నాణ్యతను సూచించే 14 స్టేషన్లలో ఎకడా 100 ఏక్యూఐ దాటలేదని అధికారులు వివరించారు.
సనత్నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతం కావడంతో అకడ సాధారణంగానే అసాధారణ వ్యాల్యూస్ నమోదవుతుంటాయని అధికారులు తెలిపారు. సనత్నగర్లో నిరుడు నవంబర్ 25న 298, డిసెంబర్లో 229, గత జనవరిలో 171 ఏక్యూఐ నమోదైంది. ఎప్పుడూ లేనంతగా సోమవారం రోజున ప్రమాదకర స్థాయిలో వ్యాల్యూస్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. సనత్నగర్లో ఎయిర్క్వాలిటీ లెకించే మీటర్ పకన రెండు కంపెనీల జనరేటర్లు ఉన్నాయని టీజీపీసీబీ సీనియర్ శాస్త్రవేత్త ప్రసాద్ తెsలిపారు. ఒకోసారి గాలి ఎకువ వీచినప్పుడు ఎయిర్ క్వాలిటీ లెవల్స్ పడిపోతుంటాయని చెప్పారు. జనరేటర్ల కారణంగానే సోమవారం మధ్యాహ్నం 431 ఏక్యూఐ నమోదై ఉండొచ్చని, దానికి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.