హైదరాబాద్ : ములుగు(Mulugu) జిల్లా తాడ్వాయి మండలం మేడారం(Medaram )గ్రామంలో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా జాతర నిర్వహణ కోసం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను(Nodal Officers) నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
వీరిలో గతంలో ములుగు జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ఆర్.వి. కర్ణన్, ఎస్ కృష్ణ ఆదిత్య, ములుగు అడిషనల్ కలెక్టర్గా పని చేసి ప్రస్తుతం ఖమ్మం మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న ఆదర్శ్ సురభితోపాటు హను మకొండ, రంగారెడ్డి జిల్లాల అడిషనల్ కలెక్టర్లు ప్రతిమ సింగ్, రాధిక గుప్తాను నియమించారు. వీరంతా ఈనెల 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జాతర ఏర్పాట్లను, నిర్వహణను పర్యవేక్షించనున్నారు.