హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జీవో 317, జీవో 46పై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కూడిన సబ్ కమిటీ సచివాలయంలో విజ్ఞప్తులను స్వీకరించింది. ఉద్యోగ సంఘాల తరఫున టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, ఎనుగుల సత్యనారాయణ, టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కస్తూరి వెంకటేశ్వర్లు విజ్ఞప్తులు అందజేశారు. రెవెన్యూశాఖ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి తెలంగాణ తాసిల్దార్స్ అసోసియేషన్ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి, అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, ట్రెసా తరఫున రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతంకుమార్ వినతిపత్రాలు అందజేశారు. ఉపాధ్యాయ సంఘాల్లో తపస్ తరఫున అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు నవాత్ సురేశ్, పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావా రవి, ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజభాను, చంద్రప్రకాశ్, రాజగంగారెడ్డి, ఎస్టీయూ నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్రెడ్డి, సదానంద గౌడ్ విజ్ఞప్తులు ఇచ్చారు.
మల్టీ జోన్-2 జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులపై హైకోర్టు స్టే తొలగించిన నేపథ్యంలో వెంటనే పదోన్నతులు చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీనియారిటీ లిస్ట్ సిద్ధంగా ఉన్నందున, వెబ్ ఆప్షన్స్కు అవకాశం ఇస్తే రెండు రోజుల్లో ప్రమోషన్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. టెన్త్ పరీక్షలు, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వెంటనే పదోన్నతులు కల్పించకపోతే వచ్చే మూడు నెలల్లో పదవీ విరమణ చేసే అనేక మంది సూల్ అసిస్టెంట్లు నష్టపోతారని పేర్కొన్నారు.