హైదరాబాద్ ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ విషయంలో సమగ్ర సమాచారంతోనే మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలన్నీ సరైనవేనని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు విజన్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముగ్ధులవుతున్నారని అన్నారు.
కేసీఆర్, కేటీఆర్లను ఆంధ్రాకు తీసుకురావాల్సిందిగా అకడి ప్రజలు కోరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ను ఓర్వలేని అధికార వైసీపీ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారని, హరీశ్పై వ్యాఖ్యలు అందులో భాగమని చెప్పారు.