హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలోని గుడిపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద అడిశర్లపల్లి (పీఏపల్లి) మండలంలోని 11 గ్రామాలతో గుడిపల్లి కేంద్రంగా ప్రత్యేక మండలం ఏర్పాటు చేశారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.