కరీంనగర్ తెలంగాణ చౌక్, ఏప్రిల్ 22 : రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కరీంనగర్లో మరో ఆటోడ్రైవర్ బలికావడం విషాదాన్ని నింపింది. యూనియన్ నాయకు లు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని గాంధీనగర్లో కిరాయి ఇంట్లో ఉం టున్న గాండ్ల శ్రీకాంత్(45) జ్యోతిబాఫూలే అడ్డాలో పదిహేనేండ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తల్లి, భార్య, ఇద్దరు బిడ్డలతో కలిసి ఉంటున్నా డు. ఆటోనే నమ్ముకొని బతుకున్న శ్రీకాంత్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మ హిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినప్పటి నుంచి కిరాయిలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఏడాదికాలంగా మరీ గోస పడుతున్నాడు. రోజువారీ ఖర్చులు కూడా ఎల్లక.. ఇంటి అద్దె, ఇద్దరు ఆడపిల్లల చ దువు, తల్లి పోషణ కు డబ్బుల్లేక ఆం దోళన చెందాడు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శ్రీకాంత్ మృతదేహానికి కరీంనగర్ ఆటో యూనియన్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ నివాళులర్పించా రు. రాష్ట్రంలో జరుగుతున్న ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలన్నీ కాంగ్రెస్ హత్యలేనని ఆ యన విమర్శించారు. శ్రీకాంత్ కుటుంబానికి పది లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు పిల్లల చదువుల ఖర్చును భరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లో తీసుకొచ్చిన ఒక్క రూపాయి అంత్యక్రియల పథకం కింద శ్రీకాంత్ అంత్యక్రియలు నిర్వహించారు.