రాజకీయాల వలన మూడేళ్లు సినిమాలకు దూరంగా పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అందించిన విజయం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో జోష్ కలిగించింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే కరోనా వలన ప్రస్తుతం ఈ చిత్రాల షూటింగ్ వాయిదా పడింది.
పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా కోసం కళాదర్శకుడు ఆనంద్సాయి కాలేజీ సెట్ను నిర్మించారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ కాలేజ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారట. కాలేజ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా ఎక్కువ భాగం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లోనే జరుగుతుందట. ఇందులో కథానాయికగా ఎవరు నటిస్తారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
.