యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి క్షేత్రంలో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఆలయ పాత కనుమ దారి విస్తరణ పనుల దృష్ట్యా శనివారం నుంచి పది రోజులపాటు అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నామని ఆలయ ఈవో గీత తెలిపారు.
కనుమ దారిలో జీయర్ కుటీర్లో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్యేశంతో నిత్యాన్నదానం నిలిపివేస్తున్నామని చెప్పారు.