మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో 4 లక్షల మంది మత్స్యకారులకు కొత్తగా గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని గొంసంద్రం చెరువులో మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, కలెక్టర్ రాజర్షిషాతో కలిసి మంత్రి 67,500 ఉచిత చేప పిల్లలను వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏండ్లు నిండిన ప్రతి మత్స్యకారునికి కొత్తగా సభ్యత్వం ఇస్తున్నట్టు తెలిపా రు. మత్స్య సంపదపై పూర్తి హక్కులు మత్స్యకారులకే సొంతమని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత మత్స్యకారులు సంతోషం గా ఉండాలనే చేప, రొయ్యపిల్లలను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తున్నదని చెప్పా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేప పిల్లలు, రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.