హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర అంగన్ వాడీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి చాంబర్ లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అంగన్ వాడీల కోసం ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడా చేయని విధంగా వేతనాలు పెంచారని, గౌరవం కల్పించారని మంత్రి చెప్పారు. ప్రభుత్వ నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు.