హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు నీటి విడుదల కోటా పూర్తయినట్టు కేఆర్ఎంబీ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్కు ఈఎన్సీకి లేఖ రాసింది.
ఈ నెల 12న జరిగిన తీర్మానం ప్రకారం సాగర్ కుడి కాలువ నుంచి నాటికి 5.50 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు పేర్కొన్నది. దీంతో సోమవారమే గేట్లను మూసివేసినట్టు
పేర్కొన్నది.