వరంగల్ : ఓ ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి పంటపొలాల్లోకి(RTC bus) దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట నుంచి భోజర్వు గ్రామానికి వెళ్తున్న పల్లె వెలుగు బస్సు చెన్నా రావుపేట మండలం పాపయ్యపేట(Papayiahpet) శివారులో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. స్టీరింగ్ రాడ్ విరగడంతో బస్సు అదుపు తప్పినట్లు స్థానికులు తెలిపారు. ప్రయాణికలో ఒకరికి మాత్రమే స్వల్పంగా గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డట్లు డీఎం తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.