రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో(Land dispute) ఓ యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చడం(Brutal murder) స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లెలో త్యాగ రాకేష్ (25)ని అతడి చిన్నమ్మ కొడుకు త్యాగ తిరుపతి గొడ్డలితో నరికి చంపాడు. రాకేష్ హత్యకు భూ తగాదాలే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ మరణంతో నర్సింహులపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.