కామారెడ్డి : వీధి కుక్కలు(Dogs attack) దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఓ వృద్ధురాలు దుర్మరణం(Old woman) చెందింది. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి(Kamareddy) జిల్లా మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ముస్తాబాద్ రామవ్వ (75) బుధవారం రాత్రి తన ఇంటి ముందు కూర్చుని ఉంది.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అయితే ఒక్కసారిగా ఆమెపైకి దూసుకొచ్చిన వీధికుక్కల గుంపు దాడి చేసింది. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన రామవ్వను తొలుత కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తీసుకెళ్తుండగా పరిస్థితి విషమించి ఆమె మార్గమధ్యలోనే మృతి చెందారు.