వరంగల్ రూరల్ : ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చాలా రోజులుగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పలువురు సిబ్బంది విధులకు గైర్హాజరైనట్లుగా గుర్తించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో మధుసూదన్, జిల్లా కలెక్టర్ హరితకు సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
గుడ్న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!