సుబేదారి, ఫిబ్రవరి 4: ఓ చిట్ఫండ్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం హనుమకొండలో చోటుచేసుకున్నది. సుబేదారి ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన నల్లా భాస్కర్రెడ్డి (28) కనకదుర్గ చిట్ఫండ్ సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. ఈ క్రమంలో చాలామంది నుంచి డిపాజిట్లు సేకరించారు. యాజమాన్యం ఆరు నెలలుగా జీతం ఇవ్వకపోగా, ఉద్యోగం నుంచి తొలగించింది. పైగా డిపాజిట్లు చేసిన వారికి యాజమాన్యం డబ్బు లు చెల్లించకపోవడంతో వారి నుంచి ఒత్తిడి పె రిగింది. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చి హరిత హోటల్లో రెండు రోజుల క్రితం రూ మ్ తీసుకొని ఉంటున్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కు టుంబ సభ్యులు ఆరా తీశారు.
హరిత హోటల్ ముందు అత డి కారును గుర్తుపట్టి, రూమ్ బుకింగ్ వివరాలను సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. వా రు చెప్పిన గదికి వెళ్లి డోర్ పగులగొట్టి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకొని విగత జీవిగా వేలాడుతూ కన్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. కాగా ఆత్మహత్యకు పాల్పడిన భాస్కర్రెడ్డితో తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని కనకదుర్గ చిట్ఫండ్ ఎండీ తెలిపారు. అతను తమ కంపెనీ డైరెక్టర్ కాదని, ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి మానేసినట్టు పేర్కొన్నారు. తమ చిట్ఫండ్ కంపెనీపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.