నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా(Nizamabad) నవీపేట మండల కేంద్రంలో ఓ ఉపాధి హామీ కూలీ వడదెబ్బకు (Heatstroke) గురై చికిత్స పొందుతూ మృతి((Laborer died) చెందింది. మండల కేంద్రంలోని లింగం గుట్ట సమీపంలో ఉన్న చెరువులో సోమవారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఆర్. లావణ్య (38) అనే కూలీ ఎండ తీవ్రతకు లోబీపీతో పల్స్రేట్ తగ్గిపోయి గుండెపోటుకు గురైంది. వెంటనే చికిత్స కోసం తోటి కూలీలు, ఉపాధి సిబ్బంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందినట్లు ఇన్చార్జి ఏపీవో నామ్దేవ్ తెలిపారు.