అయిజ, జనవరి 29: ఖాళీ ప్లాట్లో నిరుపయోగంగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని తొలగించేందుకు ఓ యజమాని నుంచి రూ.1.35 లక్షల లంచం డిమాండ్ చేశాడు విద్యుత్తు లైన్మెన్. అప్పటికే రూ.లక్షా 10 వేలు అందించగా.. సోమవారం మరో రూ.25 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది.
ఏసీబీ డీఎస్పీ హరికృష్ణగౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. అయిజకు చెందిన వీరేశ్ ఆచారికి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని సర్వే నం.733లో 90వ నెంబర్ గల ఖాళీ ప్లాట్ ఉంది. ఈ స్థలంలో విద్యుత్తు స్తంభం ఉంది. దానిని తొలగించేందుకు 2022 జనవరిలో స్థానిక విద్యు త్తు లైన్మెన్ జీవరత్నంను కలిశాడు. స్తంభం తొలగించాలంటే రూ.1.35 లక్షలు ఇవ్వాలని యజమానితో ఒప్పందం చేసుకున్నా డు.
విడతల వారీగా రూ.1.10 లక్షలను వీరేశ్ ముట్టచెప్పాడు. 2023 ఫిబ్రవరిలోనే విద్యుత్తు స్తంభాన్ని తొలగించిన లైన్మెన్.. మిగిలిన రూ.25 వే లు ఇవ్వాలని వీరేశ్పై ఒత్తిడి చే స్తున్నాడు. ప్లాన్ ప్రకారం.. వీరేశ్ లైన్మెన్కు ఫోన్ చేసి రూ.20 వేలు ఇస్తానని చెప్పాడు. పట్టణంలోని అపోలో ఫార్మసీ సమీపంలో సాయంత్రం 6:30 గంటల సమయంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి మంగళవారం హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.