నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 19 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరుస్తూ ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల వద్ద మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ నిధులు ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ప్రజలకు మోదీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.