నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద పురాతన శివాలయం వరదనీటిలో మునిగిపోయింది. గోదావరిలో భారీగా వరద నీరు వస్తుండడంతో శివాలయానికి పైనుంచి నీళ్లు వెళ్తున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీలో 80 శాతం మేర నీటి నిల్వ ఉండడం మూలంగా.. బ్యాక్ వాటర్ జలాలు, గోదావరిలో వరద నీరు పరివాహక ప్రాంతంలో జల బీభత్సం కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.