హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో 108 అంబులెన్స్ (Ambulance) చోరీ చేసి ఓ దొంగ హల్చల్ చేశాడు. హయత్నగర్లోని ఓ దవాఖాన వద్ద ఆపి ఉన్న 108 అంబులెన్స్ను చోరీ చేసి పరారయ్యాడో దొంగ. అప్రమత్తమైన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దీంతో అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అతివేగంతో విజయవాడ వైపు పరారయ్యాడు. ఈ క్రమంలో చిట్యాల వద్ద పట్టుకునేందుకు ప్రయత్నించగా ఏఎస్ జాన్ రెడ్డి వ్యక్తిని ఢీకొట్టి పారిపోయాడు. అనంతరం కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్గేట్ వద్ద గేటును ఢీకొట్టి వేగంగా దూసుకెళ్లాడు.
అయితే సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుపై లారీలు అడ్డంగా పెట్టిన పోలీసులు.. చివరికి దొంగను పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో పలు చోరీ కేసులు ఉన్నట్టు గుర్తించారు. కాగా, జాన్రెడ్డి తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు.
హైదరాబాద్లో అంబులెన్స్ చోరీ.. సినిమా స్టైల్లో అంబులెన్స్ను చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ – హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోయిన దొంగ..
హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన దొంగ..
అంబులెన్స్ సైరన్తో అతి వేగంతో పరారైన… pic.twitter.com/tWHG6CGRx8
— Telugu Scribe (@TeluguScribe) December 7, 2024