హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సచివాలయానికి అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని, ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమన్నారు.