Hyderabad | హైదరాబాద్/’ సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ట్యాంక్బండ్ జనసాగరమైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కన్నుల పండువగా సాగింది. ఆహుతులు, అంబేద్కర్ అభిమానుల కరతాళధ్వనులతో సభాప్రాంగణం మార్మోగింది. ‘జై భీమ్.. జై కేసీఆర్’ నినాదం మిన్నంటింది. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆలోచింపజేసింది. కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం మరో కొత్త రికార్డును లిఖించింది.
అంబేద్కర్ విగ్రహాష్కరణ వేడుకను వీక్షించేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. స్మృతివనం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన దాదాపు 40 వేల కుర్చీలు నిండిపోయాయి. మరోవైపు టెంట్ల బయట, ట్యాంక్బండ్, చుట్టుపక్కల రహదారుల్లో వేలాదిమంది బారులు తీరారు. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీగా కదిలివచ్చారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన బౌద్ధభిక్షువులతోపాటు కాంబోడియా, టిబెట్, భూటాన్ తదితర దేశాల నుంచి కూడా తరలివచ్చారు. మొత్తంగా సభకు 70 వేల మందికి పైగా హాజరైనట్టు అంచనా.
అంబేదర్ మహా విగ్రహావిషరణ వేడుక కనుల పండువగా కొనసాగింది. గౌరవ అతిథి ప్రకాశ్ అంబేదర్ను సీఎం కేసీఆర్ స్వయంగా తోడ్కొని రాగా బౌద్ధగురువులు సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ తొలుత అకడే ఏర్పాటు చేసిన వేదిక మీదకు చేరుకుని అంబేదర్ మహా విగ్రహాన్ని తలెత్తి దర్శించారు. తెల్లచామంతి, తమలపాకులు, గులాబీలతో తయారుచేసిన పూలదండను అంబేదర్ విగ్రహానికి అలంకరించగా, దానిని సీఎం పరిశీలించారు. అనంతరం నిర్ణీత సమయానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా అంబేద్కర్ విగ్రహంపై పూల వాన కురిసింది. ఈ సమయంలో సభికులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. అనంతరం అంబేదర్ విగ్రహాన్ని నిలబెట్టిన బేస్ భవనాన్ని ప్రకాశ్ అంబేదర్ చేతుల మీదుగా సీఎం కేసీఆర్ ఆవిషరింపజేశారు. అంబేదర్ పాలరాతి స్థూపానికి బౌద్ధ సంప్రదాయంలో భిక్షువులు ప్రార్థనలు చేశారు. ఆ తరువాత సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్, మంత్రులు గులాబీ పూలుచల్లి అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ విగ్రహం కింద ఉన్న భవనంలో ఏర్పాటుచేసిన డా బీఆర్ అంబేదర్ ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీఎస్, ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటరాగా ప్రతి ఒక ఫొటోను సీఎం కేసీఆర్ ఆసక్తితో తిలకించారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోగానే సభికులు ఒక్కసారిగా ‘జై భీం.. జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. ప్రకాశ్ అంబేద్కర్ తన ప్రసంగంలో తెలంగాణ పథకాలను, కేసీఆర్ను ప్రశంసించినప్పుడు సభికులు ఆనందంతో ఈలలు వేశారు. కేసీఆర్ ప్రసంగించడానికి లేవగానే ‘జై భీమ్.. జై కేసీఆర్’, ‘జై భారత్.. దేశ్ కి నేత కేసీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభలో ప్రదర్శించిన డాక్యుమెంటరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్సీ కార్పొరేషన్ రూపొందించిన ‘ఆత్మబంధువు అంబేదరుడు’ డాక్యుమెంటరీని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేదర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీఎస్ వీక్షించారు.
అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపైనా సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. కడియం శ్రీహరి నుంచి మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్రెడ్డితో పాటు కార్మికుల వరకు ప్రతి ఒక్కరు చేసిన కృషిని కొనియాడారు.
ప్రపంచంలో ఇంతటి భారీ అంబేద్కర్ విగ్రహం ఎక్కడా లేదు. వేడుకను చూసేందుచే కాంబోడియా నుంచి వచ్చాను. జయంతి వేడుకలను కూడా అట్టహాసంగా నిర్వహించారు. బౌద్ధ సంప్రదాయంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉన్నది. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి.
– బిక్ హర్ష్, బౌద్ధ భిక్షువు, కాంబోడియా
మహా విగ్రహావిష్కరణ వేడుకలో యువతీ, యువకులపాటు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా సందడి చేశారు. పోటీలుపడి అంబేద్కర్ విగ్రహం ఎదుట ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం హెలికాప్టర్లో పూలవర్షం కురిపించిన సన్నివేశాన్ని ఆద్యంతం మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. చాలామంది వాట్సాప్ స్టేటస్లో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహమే ఉండటం విశేషం.
అంబేద్కర్ జయంతి, మహా విగ్రహావిష్కరణను పురస్కరించుకుని ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, గిడ్డంగుల సంస్థ చైర్మన్, గాయకుడు సాయిచంద్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తించాయి. అ‘జై భీం.. జై భీం’ ‘జయహో’, ‘పేదోడి తలరాత.. రాజ్యాంగ నిర్మాత’ పాటలు సభికుల్లో ఉత్తేజం నింపాయి. యువకులు, అంబేద్కర్ అభిమానులు గాయకులతో గొంతు కలిపి, పదం కలిపి న్యత్యాలు చేశారు.