సంగారెడ్డి : ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మంత్రి హరీశ్రావుతో కలిసి సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ను కోరారు.
గతంలో మాదిరిగానే నియోజకవర్గానికి మరిన్ని నిధులు కేటాయించాలని విన్నవించినట్లు ఎమ్మెల్యే క్రాంతి తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో గతంలో ఎన్నడు జరుగనంత అభివృద్ధి అందోల్ జరుగుతుందన్నారు.