హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): మార్ఫెడ్, మారెటింగ్, హాకా, వేర్హౌసింగ్ వంటి ప్రభుత్వ సంస్థల ఆధీనంలోని గోదాములన్నింటినీ ఒకే సమన్వయ వ్యవస్థ కింద నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. తద్వారా నిర్వహణ వ్యయాలు తగ్గడంతోపాటు ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వేర్హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రెండేండ్లలో ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి అదనంగా మరో 5 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల కొత్త గోదాముల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు.