నెక్కొండ, సెప్టెంబర్1: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామస్థులంతా బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్యనాయకులు, మాజీ సర్పంచ్, నలుగురు వార్డుమెంబర్లు, వందకుపైగా కుటుంబాలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ప్రతిపక్షం లేని గ్రామంగా నాగారం నిలిచింది. పార్టీలో చేరిన వారికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి పట్టం కడుతూ నాయకులంతా ఐక్యంగా కలిసి వచ్చారని పేర్కొన్నారు. అన్ని గ్రామాలు ఇదే స్ఫూర్తితో ఒకే తాటిపై నిలబడి రావాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్య సరోజాహరికిషన్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి వార్డు మెంబర్ నాంపల్లి శ్రీను, రేబల్లి లోకేశ్, ఉండ్రాతి వెంకన్న, రామడుగు రాజు, మద్దెబోయిన అశోక్, బోళ్ల యాకయ్య, యలగందుల సోమయ్య, గాడ్ల చిన్నబాలయ్య , ఉప్పలి భద్రయ్య, పోతరాజు చేరాలు, మల్లంశ్రీను, పొనకంటి రాజు, నాంపల్లి రాంచంద్రు, రాజు, ఎండీ సహీరా, గండ్ల భిక్షపతితోపాటు పలు కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. బీజేపీ నుంచి మాజీ సర్పంచ్ శీలం వెంకన్న, వార్డు సభ్యులు సువర్ణ, సుజాతాముఖేశ్, చెంచు వెంకటలక్ష్మి, అటిక కట్టయ్య, బొడ్డు వీరస్వామి, చెందు సుధాకర్, దారపు వెంకటేశ్తోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు.