మూసాపేట, జూన్ 26 : ఎస్ఐఆర్ సర్వేలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు భాగస్వాములు కావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో మండలంలోని గుడిబండ, రాచాల, పొన్నకల్ గ్రామాల బీఆర్ఎస్ బూత్స్థాయి ఏజెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ఎస్ఐఆర్ సర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్వేలో బూత్ లెవల్ ఏజెంట్లు ప్రతి కుటుంబాన్నీ కలువాలని, అధికారులతో సమన్వయంగా ఉంటూ ఎన్యుమరేషన్ ఫారమ్ నింపే ప్రక్రియలో ప్రజలకు వివరాలు తెలియజేస్త్తూ సహకరించాలని సూచించారు.